కార్వే సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కాల్ సెంటర్లలో పని చేస్తున్నామని.... వేతనాల కోసం ఎవరిని సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయాలనుకున్నారు. కలెక్టరు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. తమకు వేతనాలతోపాటు పీఎఫ్ కూడా ఖాతాల్లో జమ కావడం లేదని- వీటిపై ముఖ్యమంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కిన కాల్ సెంటర్ ఉద్యోగులు - కృష్ణా జిల్లా కాల్సెంటర్ ఉద్యోగుల నిరసన న్యూస్
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కాల్సెంటర్లలో విధులు నిర్వహిస్తున్నా... తమకు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 1902, 1400, 14500 కాల్సెంటర్లలో పనిచేస్తోన్న సుమారు ఆరు వందల మంది రోడ్డెక్కారు.
![వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కిన కాల్ సెంటర్ ఉద్యోగులు call center employees agitaion for salaries in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8625421-971-8625421-1598867049934.jpg)
call center employees agitaion for salaries in krishna district