భవన నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుభాష్ చంద్రబోస్ అన్నారు. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా.. ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు చంద్రబోస్ వెల్లడించారు. క్రెడాయ్, నేరాడ్కో, చాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలన్నీ ఈ విరామంలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.
'నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఒక్కరోజు విరామం' - సతమతమవుతుందన్న భవన నిర్మాణ రంగం
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఉంది.. భవన నిర్మాణ రంగ పరిస్థితి. కరోనా కారణంగా నత్తనడకన నడుస్తున్న ఈ రంగాన్ని.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 9న ఒక్కరోజు విరామం ప్రకటించినట్లు క్రెడాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు.
!['నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఒక్కరోజు విరామం' building and developers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14973225-162-14973225-1649501061826.jpg)
కరోనా కారణంగా భవన నిర్మాణ రంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతోందని.. కార్మికుల వలస కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయిపోయిందని సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముడి సరుకు లేనా స్టీల్, సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈ భారం అంతిమంగా కొనుగోలు ధరపై ప్రభావం చూపుతోందన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టిసారించి ధరల పెరుగుదలను నియంత్రించాలని కోరారు. ఈ సమావేశంలో క్రెడాయ్ విజయనగరం ఛైర్మన్ వి. పార్థసారథి, అధ్యక్షులు సీహెచ్ సూర్యనారాయణ రాజు, కార్యదర్శి కె. రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదంవడి:
construction traders: పవర్ హాలిడేపై... నిర్మాణ రంగ వ్యాపారులతో ముఖాముఖి