ఏపీ సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సహచర ఎంపీలకు రాసిన లేఖ పట్ల ఆయనకు మద్దతు పెరుగుతోంది. భాజపా ఎంపీ, నీటి పారుదల వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్ సంజయ్ జైస్వాల్.. రఘురామ లేఖపై స్పందించారు. ఎంపీపై దాడి తనను బాధించిందని వివరించారు. ఘటనపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా సంజయ్ జైస్వాల్ రఘురామకు తెలిపారు.
రఘురామపై జరిగిన దాడి బాధించింది : భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ - bjp mp sanjay jaiswal
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు.. ప్రవర్తించిన తీరును భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ ఖండించారు. ఈ ఘటనపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు.
![రఘురామపై జరిగిన దాడి బాధించింది : భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్ BJP mp sanjay jaiswal fire on mp raguramakrishnaraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12048052-460-12048052-1623078763610.jpg)
భాజపా ఎంపీ సంజయ్ జైస్వాల్