ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2020, 1:24 PM IST

ETV Bharat / city

వైకాపాను ప్రజలెవరూ నమ్మరు: కన్నా

వైకాపా మూడు రాజధానుల నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు.

bjp leader kanna about ysrcp govt capital decision
bjp leader kanna about ysrcp govt capital decision

వైకాపాను ప్రజలెవరూ నమ్మరు: కన్నా

వైకాపా ప్రభుత్వ విధానాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు చేసిన ప్రచారంలో.. రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదని గుర్తు చేశారు. నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న కన్నా.. వైకాపా ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. 2024లో ప్రజలు వైకాపాకు సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రాజధాని మార్చేందుకు వైకాపా చెబుతున్న మాటలను ప్రజలెవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. త్వరలోనే జనసేనతో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details