రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై మమతా బెనర్జీ అనుచరులు భౌతిక దాడులు, హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు.. ఎవరింట్లో వారు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నిరసన తెలపాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు భాజపా పిలుపు - రేపు గంటపాటు రాష్ట్రవ్యాప్త నిరసనకు భాజపా పిలుపు
పశ్చిమ బంగాల్లో భాజపా కార్యకర్తలు, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు చెప్పారు. తృణమూల్ నేతలే దాడుల వెనక ఉన్నారని ఆరోపించారు. రేపు ఉదయం 11 నుంచి ఓ గంటపాటు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇళ్లలో ఉండి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
![రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు భాజపా పిలుపు bjp state president call for protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11640525-831-11640525-1620138292277.jpg)
రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు భాజపా పిలుపు
"దేశంలో ఎక్కడాలేని విధంగా పశ్చిమ బంగాల్లో టీఎంసీ గూండాలు దాడులకు తెగబడ్డారు" అని సోము వీర్రాజు విమర్శించారు. అక్కడి భాజపా కార్యకర్తలు, ఆస్తులు, కార్యాలయాలు, నాయకులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం