కార్పొరేషన్లో ఛైర్మన్ సహా 12 మంది డైరెక్టర్లు ఉంటారని మంత్రి వేణుగోపాల్ తెలిపారు. సామాజిక స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేస్తూ ఎంపిక చేశారన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు 56 మంది ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రభుత్వంలో సీఎం జగన్ భాగస్వామ్యం కల్పించారన్నారు. కొత్తగా నియామకమైన వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితా విడుదల చేసిన మంత్రి వేణుగోపాల్ - బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితా విడుదల న్యూస్
672 డైరెక్టర్ల పదవుల్లో 333మంది పురుషులు, 339 మంది బీసీ మహిళలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. మొత్తం 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన డైరెక్టర్ల జాబితాను విడుదల చేశారు.
బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితా విడుదల చేసిన మంత్రి వేణుగోపాల్