ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 3, 2020, 12:30 AM IST

ETV Bharat / city

'14 నెలల్లో ఒక్క ఇటుక పెట్టని జగన్.. 3 రాజధానులు నిర్మిస్తాడట'

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి.. జగన్ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేక.. కరోనా రాగానే హైదరాబాద్ వెళ్లారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మళ్లీ ట్విట్లు మెుదలుపెట్టారని విమర్శించారు.

ayyannapatrudu comments on jagan
ayyannapatrudu comments on jagan

14 నెలల్లో ఒక్క ఇటుక పెట్టని జగన్‌ 3 రాజధానులు నిర్మిస్తాడని జనాల చెవిలో విజయసాయిరెడ్డి పువ్వులు పెడుతున్నాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఇదంతా చూస్తున్న వైకాపా నాయకులు మింగలేక కక్కలేక మొహాలన్నీ కందగడ్డలా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఒకపక్క కరోనా విలయతాండవం చేస్తుంటే 3 రాజధానుల ఆనందం బ్లూ మీడియాలో తప్ప ఎక్కడా కనపడటం లేదని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details