ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Asha workers chalo collectorate: రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల చలో కలెక్టరేట్‌ కార్యక్రమం - రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల చలో కలెక్టరేట్‌ కార్యక్రమం

Asha workers chalo collectorate: రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. గౌరవ వేతనం రూ.15వేలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని కోరారు. పలు చోట్ల ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Asha workers chalo collectorate statewidely
రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల చలో కలెక్టరేట్‌ కార్యక్రమం

By

Published : Feb 22, 2022, 5:29 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల చలో కలెక్టరేట్‌ కార్యక్రమం

Asha workers chalo collectorate: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ర్యాలీలు, దీక్షలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలను అడ్డుకుంటున్న పోలీసులు.. ఆశాలను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లాలో..

ఆశావర్కర్ల కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా కృష్ణా జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. కలెక్టరేట్ల వద్దకు ఆశాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిలో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహన తనిఖీలు చేపట్టారు.

నందిగామ, గుడివాడ, తిరువూరు మండలం లక్ష్మీపురం వద్ద ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. పోలీస్‌స్టేషన్ల ఎదుటే ఆశాలు ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియచేయాలనుకున్న తమను అరెస్టు చేయడంపై ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసుల అదుపులో ఉన్న ఆశాలను.. తెదేపా, సీఐటీయూ నాయకులు పరామర్శించారు

కర్నూలులో..

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. కర్నూలు కలెక్టరేట్‌, నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ధర్నా చేశారు. పని భారాన్ని తగ్గింది, 15వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. పదిలక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు, అయిదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతపురంలో..
అనంతపురం జిల్లా మడకశిర నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.

విశాఖలో..

విశాఖ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీఎంహెచ్​వో కార్యాలయం, సీఐటీయూ కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించారు. ఓ ఆరుగురు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలవడానికి పోలీసు వాహనంలోనే తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో ఓ అధికారికి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా లేకపోవడం దౌర్భాగ్యమని ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళంలో..

శ్రీకాకుళం కలెక్టరేట్ వద్దకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆశావర్కర్లు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. కొవిడ్ కాలంలో మరణించిన ఆశాల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం చెల్లిస్తున్న కొవిడ్ అలవెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరిలో..

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:RRR: ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా: ఎంపీ రఘురామ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details