జనవరి 26న జరగనున్న 72వ గణతంత్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ముస్తాబవుతోంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్య అతిథులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . పరేడ్లో పాల్గొనే కవాతు దళాలు , శకటాలు రిహాసల్స్ చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా సీఎం జగన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. కొవిడ్ నేపథ్యంలో కంటిజెన్స్ కు ముందుగానే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 12 శకటాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో పాల్గొననున్నాయి .
ఇందిరాగాంధీ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..విస్తృత ఏర్పాట్లు - గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు సీఎం జగన్ పాల్గొననున్నారు.
![ఇందిరాగాంధీ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..విస్తృత ఏర్పాట్లు republic day celebrations in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10365354-48-10365354-1611499269241.jpg)
గణతంత్ర దినోత్సవ వేడుకలు