ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏషియన్ ఛాంపియన్స్ షిప్​లో స్వర్ణమే లక్ష్యం: జ్యోతి సురేఖ - archer jyothi surekha arrived at gannavaram airport

అమెరికాలో జరిగిన సీనియర్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్​లో పాల్గొని మూడు పతకాలు గెలిచిన క్రీడాకారిణి జ్యోతి సురేఖ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రానున్న ఏషియన్ ఛాంపియన్స్ షిప్​లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

జ్యోతి సురేఖ
జ్యోతి సురేఖ

By

Published : Oct 12, 2021, 9:25 PM IST

రానున్న ఏషియన్ ఛాంపియన్స్ షిప్​లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తానని ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు అమెరికాలో జరిగిన సీనియర్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్​లో భారత్ తరఫున ఆడి మూడు సిల్వర్ మెడల్స్ సాధించి తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జ్యోతి సురేఖకు రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

అమెరికాలో జరిగిన టోర్నమెంట్​లో సింగిల్, టీమ్, మిక్స్​డ్​ టీం మూడు ఈవెంట్లలో సిల్వర్ మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉందని క్రీడాకారిణి జ్యోతి సురేఖ తెలిపారు. రానున్న ఏషియన్ ఛాంపియన్ షిప్​లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details