ఐటీ విభాగంలో ఎపీఎస్ఆర్టీసీ వరుసగా రెండోసారి జాతీయ స్థాయి అవార్డు సాధించింది. 2021 ఏడాదికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో 'డిజిటల్ టెక్నాలజీ సభ' అవార్డుకు ఆర్టీసీ ఎంపికైంది. జాతీయ స్థాయిలో వివిధ సంస్థలతో పోటీ పడిన ఆర్టీసీ ఈ అవార్డును కైవసం చేసుకుంది.
ఐటీ విభాగంలో ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయస్థాయి అవార్డు - apsrtc latest news
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ఐటీ విభాగంలో వరుసగా రెండోసారి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. బుధవారం ఆ సంస్థ ఎండీ ఆర్పీ ఠాకూర్ అవార్డు అందుకోనున్నారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో .. ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ అవార్డు
ఐటీ విభాగంలో గతేడాది కూడా డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు ఏపీఎస్ఆర్టీసీకే వరించింది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్లను ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. వాటిని సమర్థంగా అమలు చేస్తున్నందుకుగాను ఈ అవార్డుకు ఎంపికైంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు వర్చువల్ సెమినార్ ద్వారా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ అవార్డు అందుకోనున్నారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: డి.రాజా