ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2022, 5:27 PM IST

ETV Bharat / city

Sailajanath On Budget: కేంద్రం గోల్​మాల్ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది: శైలజానాథ్

Sailajanath On Budget: మోదీ సర్కార్ మసిపూసి మారేడు కాయ చేసి గోల్​మాల్ బడ్జెట్​ను ప్రవేశపెట్టిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జీరో' సమ్ బడ్జెట్ ప్రవేశపెట్టి వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావన లేకపోవటం దారుణమన్నారు.

కేంద్రం గోల్​మాల్ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది
కేంద్రం గోల్​మాల్ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది

APCC Sailajanath On Budget: కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇతర అంశాల ప్రస్తావన లేకపోవటం దారుణమన్నారు. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసి ఇప్పుడు డిజిటల్ భారత్ అంటూ కొత్త పల్లవి అందుకుందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు, రైతులు, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసిందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం 'జీరో' సమ్ బడ్జెట్ ప్రకటించిందని, వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని ఎద్దేవా చేశారు. మసిపూసి మారేడు కాయ చేసి గోల్​మాల్ బడ్జెట్​ను ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని ఆక్షేపించారు. దేశంలోని చేనేత రంగానికి బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఆదాయపన్ను స్లాబులు మార్చకపోవటం విచారకరమని శైలజానాథ్ కేద్రంపై మండిపడ్డారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు, పన్ను చెల్లింపుదారుల ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు. కరోనా నేపథ్యంలో దేశంలోని వైద్య రంగాన్ని అభివృద్ధిపరచటంతో సహా మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఓ వైపు చెబుతూనే మరోవైపు ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయకపోవడం శోచనీయమని శైలజానాథ్ అన్నారు.

ఇదీ చదవండి

Union budget 2022: నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్​!

ABOUT THE AUTHOR

...view details