ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2021, 9:03 PM IST

ETV Bharat / city

'దసరాకు గృహ ప్రవేశాలన్నారు.. పునాదులే పూర్తి కాలేదు'

గత రెండేళ్లలో పది శాతం ఇళ్లను కూడా ప్రభుత్వం పూర్తి చేయలేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ విమర్శించారు. ఇళ్లకు కేంద్రం ఇచ్చే నిధుల్లో చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు.

పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్
పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్

పేదలకు పక్క ఇళ్లు ఇస్తామంటున్న ప్రభుత్వం రెండేళ్లలో పది శాతం ఇళ్లు కూడా పూర్తి చేయలేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్​ విమర్శించారు. దసరా నాటికి గృహ ప్రవేశాలు జరుపుతామన్న ప్రభుత్వం చెప్పిందని అన్నారు. అయితే ఇంతవరకు ఇంటి నిర్మాణం పునాదులే పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇస్తుంటే..రాష్ట్రం కొన్నింటినే ఇస్తోంది

అప్పులు తెచ్చి కాలం వెళ్లదీస్తున్న సర్కారు.. పేదలకు పక్కా ఇళ్లు ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం పేదల ఇంటికి కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని.. వాటిని కూడా ఉపాధి హామీ నిధులకు ముడిపెట్టేసిందని మండిపడ్డారు. పీఎంఏవై కింద కట్టే ఈ ఇళ్లకు కేంద్రం మూడు దఫాలుగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. తొలి, రెండో విడతల్లో రూ. 60వేలు, మూడో విడతలో రూ. 30వేలు కేంద్రం విడుదల చేస్తుందన్నారు.

ఇళ్ల నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు

వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ రూ.3700 కోట్లు కేంద్రం విడుదల చేసిందని తెలిపారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1700 కోట్లు మాత్రమే ఇళ్ల కోసం వినియోగించిందని అన్నారు. దాదాపు 2వేల కోట్ల ఇళ్ల నిధుల్ని రాష్ట్రప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందన్నారు. రాష్ట్రంలో సుమారు 2.62 లక్షల ఇళ్ల పనులు ముందుకు సాగడంలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లనే ఇప్పటికీ ప్రభుత్వం పంపిణీ చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇళ్లు కేటాయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పేదలకు ఇళ్లు కట్టించడంలో రాష్ట్రం మొదటి స్థానం: రోజా

ABOUT THE AUTHOR

...view details