ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Curfew:కర్ఫ్యూలో సడలింపులు.. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలు! - ఈ నెల 30 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ తాజా వార్తలు

కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తోన్న కర్ఫ్యూ ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాల జారీ చేసింది. ఈనెల 30 వరకు కర్ఫ్యూ ను కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండదని స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు.

Curfew:కర్ఫ్యూలో సడలింపులు..
Curfew:కర్ఫ్యూలో సడలింపులు..

By

Published : Jun 20, 2021, 3:23 PM IST

Updated : Jun 21, 2021, 7:33 AM IST

రాష్ట్రంలో తూర్పుగోదావరి మినహా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుందని వివరించింది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొంది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఈ ఆదేశాల్ని అమలు చేయాలని ఆదేశించింది.

Last Updated : Jun 21, 2021, 7:33 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details