ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2021, 5:23 PM IST

ETV Bharat / city

నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ: సజ్జల

విశాఖకు రాజధాని తరలింపు దిశలో నాలుగైదు నెలల్లో అడుగులు పడతాయని భావిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందన్నారు.

నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ
నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ

విశాఖకు రాజధాని తరలింపు దిశలో నాలుగైదు నెలల్లో అడుగులు పడతాయని భావిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు చూపాలంటే వీలైనంత త్వరలో ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఆలోపు న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ

ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెనుక దురుద్దేశాలు

ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యనించారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావటం అనుమానాస్పదంగా ఉందన్నారు.

ఇదీచదవండి:రైతు వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేయాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details