ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cabinet Meeting: మార్చి 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

By

Published : Feb 26, 2022, 10:13 PM IST

మార్చి 3న సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్​లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనున్నట్లు సీఎస్ కార్యాలయం వెల్లడించింది.

మార్చి 3న  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
మార్చి 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

వచ్చే నెల మూడో తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుందని ఏపీ సీఎస్ కార్యాలయం స్పష్టం చేసింది. సచివాలయం మొదటి బ్లాక్​లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎంవో అధికారులు తెలిపారు.

కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించే అంశాలతో కూడిన జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ మార్చి 2 మధ్యాహ్నం ఒంటి గంటలోపుగా పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details