ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆడిట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. ధర్నాచౌక్​లో రిలే నిరాహార దీక్షలు

By

Published : Oct 18, 2022, 8:23 PM IST

AUDIT EMPLOYEES PROTEST : ఆడిట్​​ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆడిట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు రిలే నిరహార దీక్షలు చేపట్టారు.

AUDIT EMPLOYEES PROTEST
AUDIT EMPLOYEES PROTEST

AP STATE AUDIT : రాష్ట్ర ఆడిట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్​లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రిలే దీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ఆడిట్ ఉద్యోగుల సమస్యలను ఇన్​ఛార్జ్​ డైరెక్టర్ హరిప్రకాష్ వద్దకు పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతోనే నిరసనలకు దిగారన్నారు. ఆడిట్ శాఖలో ప్రభుత్వ సంస్కరణలను అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృషి చేస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details