ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 6, 2021, 1:26 PM IST

Updated : Jul 6, 2021, 8:24 PM IST

ETV Bharat / city

kambhampati: మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా: కంభంపాటి

దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు.. మిజోరాం గవర్నర్​గా(mizoram governer) నియమితులయ్యారు.

Kambhampati Hari Babu
Kambhampati Hari Babu

రాష్ట్రంలో భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు(kambhampati hari babu)ను మిజోరాం గవర్నర్​గా నియమించారు. ఆయన విశాఖపట్నం(vishakapatnam) లోక్​సభ నుంచి.. 2014లో ఎంపీగా గెలుపొందారు. కంభంపాటి భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు.

హరిబాబు ప్రకాశం(prakasham) జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని(vishakapatnam) ఆంధ్రా విశ్వవిద్యాలయంలో(andhra university) ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బిటెక్ చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేసి 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా..

మిజోరాం గవర్నర్​గా కంభంపాటి హరిబాబు

మిజోరాం గవర్నర్ గా నియమించడం సంతోషంగా ఉందని విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని,పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఎంపీగా, ఏపీ బిజెపి అధ్యక్షుడిగా, అనేక రాష్ట్రాలకు ఇన్​చార్జిగా పని చేసిన అనుభవంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు.

మిజోరాం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయ పడ్డారు.

ఉపరాష్ట్రపతి అభినందనలు..

మిజోరాం గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. మిజోరం అభివృద్ధిలో హరిబాబు భాగస్వామి కావాలని వెంకయ్య నాయుడు ఆశించారు.

పవన్‌ కల్యాణ్‌ అభినందనలు..

మిజోరం గవర్నర్‌గా నియమితులైన ఏపీ భాజపా సీనియర్‌ నేత కంభంపాటి హరిబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆచార్యుడిగా, ప్రజాప్రతినిధిగా విశాఖకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే, ఎంపీగా.. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించారని వెల్లడించారు. హరిబాబు అనుభవం మిజోరం అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

స్వగ్రామంలో వెల్లివిరిసిన ఆనందం..

కంభంపాటి కుటుంబీకుల ఆనందం

కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్​గా నియమించటం పట్ల ఆయన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంభంపాటి హరిబాబు బంధువులు, స్నేహితులు ఆయనకు ఫోనులో శుభాకాంక్షలు తెలిపారు.

"చిన్నప్పటి నుండి చదువుల్లో చురుకుగా ఉండేవారు. జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్యనాయుడితో కలిసి పాల్గొన్నారు. కంభంపాటి హరిబాబుది ముక్కుసూటి మనస్తత్వం." - ముద్దన జయచంద్రశేఖర్, హరిబాబు బావ

ఇదీ చదవండి:

మిజోరాం గవర్నర్​గా హరిబాబు - దత్తాత్రేయ బదిలీ

Last Updated : Jul 6, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details