ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2019, 9:01 PM IST

ETV Bharat / city

'కృష్ణ కిషోర్​ను చంద్రబాబు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు'

పరిశ్రమలు, వాణిజ్య శాఖ నివేదిక ప్రకారమే ఐఆర్​ఎస్ అధికారి, ఈడీబీ మాజీ సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్​ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని వైకాపా ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. తప్పు చేసిన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

ambati rambabu on irs officer krishna kishore
ambati rambabu on irs officer krishna kishore

'ఐఆర్​ఎస్​ అధికారి సస్పెన్షన్​ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి'

ఐఆర్​ఎస్ అధికారి, ఈడీబీ మాజీ సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్​ సస్పెన్షన్​పై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. తప్పు చేశారని.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా కొందరు ఎక్కువగా స్పందిస్తున్నారని అంబటి అన్నారు. జగన్​పై సీబీఐ కేసుల్లో చంద్రబాబుతో కృష్ణకిషోర్ కుమ్మక్కైనట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి డిప్యుటేషన్​పై వచ్చిన అధికారిని చంద్రబాబు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో ఘర్షణ వాతావరణం సమంజసనీయం కాదని వ్యాఖ్యానించారు. అవసరమయితే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా మార్షల్స్ తనిఖీ చేస్తారన్నారు. సీనియర్ నేతగా చంద్రబాబుకు ఇవన్నీ తెలిసే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details