ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే ఆ ముగ్గురి భేటీ: అంబటి

తెదేపా అధినేత చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్​లు సమావేశమయ్యారని.. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. వారి భేటీ అనైతికమని.. దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

By

Published : Jun 24, 2020, 8:15 PM IST

ambati rambabu about nimmagadda sujana srinivas meeting
అంబటి రాంబాబు, వైకాపా నేత

హైదరాబాద్​లోని ఓ హోటల్​లో భాజపా నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్​తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై రమేశ్ కుమార్ ఎందుకు నోరు విప్పడంలేదని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వీరి భేటీ అనైతికమని, దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

సుజనా, శ్రీనివాస్ ఇద్దరూ భాజపాలో ఉన్న తెదేపా సానుభూతిపరులని, వీరితో భాజపా నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిద్దరూ భాజపాలో ఉంటూ తెదేపా కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే ఆ ముగ్గురూ భేటీ అయ్యారన్నారు.

ABOUT THE AUTHOR

...view details