మత కల్లోలాలు రెచ్చగొట్టి.. గొడవలు రేపే కుట్రలో భాగంగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. దేవుడి డబ్బు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం రహస్య అజెండాలో భాగమేనని విమర్శించారు. మంత్రులు చేసే వ్యాఖ్యలే ఈ అనుమానాలకు తావిస్తోందన్న అమర్నాథ్ రెడ్డి... తప్పించుకోవాలని చూడటం, తేలిగ్గా తీసుకుని మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం కఠినంగా ఉంటే ఈ తరహా దాడులు ఖచ్చితంగా జరగవని స్పష్టం చేశారు.
దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి - జగన్పై అమర్నాథ్ రెడ్డి కామెంట్స్
తితిదే ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రహస్య అజెండా ఉందనేలా ఛైర్మన్ వ్యాఖ్యలున్నాయని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో దేవాలయాల డబ్బును ఖజానాకు మళ్లించే ఆలోచనలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
![దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8861275-99-8861275-1600516613299.jpg)
దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి