విజయవాడ-నూజివీడు రహదారిపై కిలోమీటర్ మేర సెంట్రల్ లైటింగ్ను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ప్రారంభోత్సవానికి రోడ్డు డివైడర్ మధ్యలో శిలా ఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు.
రోడ్డు మధ్యలో శిలాఫలకం.. ప్రమాదాలకు కారణం - విజయవాడ వార్తలు
విజయవాడ నగర శివారులోని నూజివీడు రహదారి డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం ప్రమాదాలకు కారణమవుతుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
![రోడ్డు మధ్యలో శిలాఫలకం.. ప్రమాదాలకు కారణం Accidents are taking place with a stone slab set up in the middle of the Vijayawada Noojeedu road divider](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10730775-502-10730775-1613995138331.jpg)
ప్రమాదాలకు కారణమవుతున్న శిలాఫలకం
కండ్రికకు వెళ్ళే మలుపు వద్ద ఏర్పాటు చేసిన ఈ శిలా ఫలకం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శిలాఫలకం కనిపించకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుపుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.