ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crime News: తన భర్తతో సంబంధం పెట్టుకుందని..ఆమె ఏం చేసిందంటే..!

By

Published : Dec 11, 2021, 10:58 AM IST

woman murder: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను.. ఆ వ్యక్తి భార్యే హత్య చేసిన ఉదంతం విజయవాడలోని రాణిగారితోటలో చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Crime News
Crime News

woman murder in vijayawada: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఆ వ్యక్తి భార్యే హత్య చేసిన ఘటన విజయవాడలోని రాణిగారితోటలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు రౌతు సత్య (36) భర్త, కుమార్తెతో కలిసి రాణిగారితోట 18వ డివిజన్‌ కరెంటు ఆఫీసు పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. భర్త భవానీపురంలో ముఠా కార్మికుడిగా, సత్య ఏలూరురోడ్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో వారు ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉండే ఒరుసు ఆదినారాయణతో సత్యకు ఏడాదిగా పరిచయం ఏర్పడి వివాహేతర బంధంగా మారింది. విషయాన్ని తెలుసుకున్న భర్త పలుమార్లు వారించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన భర్త ఇటీవల కుటుంబానికి దూరంగా భవానీపురంలో ఒంటరిగా ఉంటున్నారు.

ఇలా ఉండగా వివాహేతర సంబంధం విషయంపై ఆదినారాయణ భార్య మల్లేశ్వరికి, సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో సుమారు 20రోజుల కిందట సత్య ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కుమార్తెతో లక్కీబార్‌ సందులోని ఇంట్లో అద్దెకు దిగింది. ఆదినారాయణ రోజూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఎనిమిదో తరగతి చదువుతున్న సత్య కుమార్తె గురువారం మధ్యాహ్నం హనుమాన్‌జంక్షన్‌ వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. లోపలకు వెళ్లి చూడగా, రక్తం మడుగులో తల్లి అచేతన స్థితిలో ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి సత్య మృతిచెందినట్లుగా నిర్ధారించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు..

ఘటనపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు మృతురాలి గొంతు భాగంలో కోసినట్లుగా ఉండటం, తలపై పలుచోట్ల గాయాలుండటంతో కిరాయి వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని మొదట భావించారు. ఘటనాస్థలంలో వేలి ముద్రలను సేకరించారు. జాగిలాలు రప్పించారు. అవి కరెంటు ఆఫీసు పరిసరాలకు వరకు వెళ్లడాన్ని బట్టి మృతురాలికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అని ఆరా తీయగా వివాహేతర సంబంధం విషయం వెలుగుచూసింది. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇంటి పరిసరాల్లోని లక్కీబార్‌ వద్ద ఉన్న సీసీ కెమేరా ఫుటేజీని పరిశీలించగా రాత్రి 8.30గంటల సమయంలో మల్లేశ్వరి క్యారీబ్యాగ్‌తో బార్‌ పక్క వీధిలోకి వెళ్లినట్లుగా తేలడంతో ఆమెతో పాటు భర్త ఆదినారాయణలను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పథకం ప్రకారం బ్లేడు, చాకుతో సత్య ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవపడిన మల్లేశ్వరి మొదట బ్లేడుతో ఆమె గొంతు భాగంలో కోసింది. తర్వాత అక్కడే ఉన్న రోకలిబండతో తలపై పలుమార్లు మోదడంతో ఘటనాస్థలంలో సత్య మృతి చెందింది. అనంతరం మల్లేశ్వరి వెళ్లిపోయింది. తానే హత్యకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుందని, అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణలంక సీఐ పి.సత్యానందం వెల్లడించారు. హత్య జరిగిన ఇంటిని సౌత్‌జోన్‌ ఏసీసీ వెంకటేశ్వర్లు పరిశీలించారు.

ఇదీ చదవండి:

Orphan baby: అమ్మా నేను భారమా.. ఎందుకీ దూరం..?

ABOUT THE AUTHOR

...view details