అమరావతి ఉద్యమానికి విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు బాసటగా నిలిచారు. ఎన్టీఆర్ భవన్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కలిసి ఉద్యమానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను లోకేశ్ అభినందించారు. మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకొని.., ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
లోకేశ్ను కలిసిన వారిలో ఆలపాటి రాజా, జాస్తీ సరళ, రమ్య, శివరామ కృష్ణ, మేకా గోకుల్ చంద్, గౌతమ్, శ్రీధర్, రాజేష్, సతీష్, వాసు తదితరులు ఉన్నారు.