ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డీఎస్సీ -1998 క్వాలిఫైడ్ టీచర్లకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది'

అధికారంలోకి వచ్చాక 1998 క్వాలిఫైడ్ టీచర్లకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్ మాటమార్చారని డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ టీచర్లు ఆరోపించారు. సుదీర్ఘంగా తాము పోరాటం చేస్తున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సుల మేరకు తగిన న్యాయం చేయాలని కోరారు.

By

Published : Jun 17, 2021, 7:55 PM IST

dsc qualified teachers
డీఎస్సీ -1998 క్వాలిఫైడ్ టీచర్లు

డీఎస్సీ -1998 క్వాలిఫైడ్ టీచర్లకు.. ప్రభుత్వం మొండిచేయి చూపించిందని.. టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ టీచర్లు సమావేశమయ్యారు. 22 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా తాము పోరాటం సాగిస్తున్నా.. తమ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ టీచర్లకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్ మాట తప్పారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం వేసిన ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details