ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2020, 1:24 PM IST

Updated : Jul 8, 2020, 2:01 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు

1062 new corona cases registered in andhrapradesh
1062 new corona cases registered in andhrapradesh

13:21 July 08

కరోనాతో మరో 12 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,062 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 22, 259కి చేరాయి. వైరస్ కారణంగా... మరో 12 మంది మృతి  చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 264కి చేరింది. కర్నూలు జిల్లాలో మరో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, ప.గో.జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాకు బలయ్యారు. స్థానికుల్లో 1,051 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి పాజిటివ్​గా తేలగా...ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 10 వేల 894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jul 8, 2020, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details