ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుపతి రైల్వేస్టేషన్​లోనూ ఐసొలేషన్ కేంద్రాలు

By

Published : Apr 4, 2020, 2:02 PM IST

విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైలు కోచ్​లను ఐసోలేషన్​ కేంద్రాలుగా మార్చేస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్​లోనూ ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు.

Work is underway to provide isolation centers at Tirupati Railway Station
Work is underway to provide isolation centers at Tirupati Railway Station

తిరుపతి రైల్వే స్టేషన్​లోనూ ఐసోలేషన్ కేంద్రాలు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో రైల్వే శాఖ సైతం భాగస్వామ్యం అవుతోంది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే కోచ్​లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే విధంగా రైల్వే శాఖ ప్రణాళికలు రచించింది. దేశవ్యాప్తంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న రైళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న దక్షిణ మధ్య రైల్వే... తిరుపతి రైల్వే స్టేషన్​లో 60 కోచ్​లను ఐసోలేషన్ కేంద్రాలుగా తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు 500మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. రైల్వే సిబ్బంది, పోలీసులు పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఇవి అందులోకి రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details