ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికుల అనుమానాస్పద మృతి.. శానిటైజర్​ తాగడమే కారణమా..?

చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్కావెంజర్స్​ కాలనీలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వీరు మద్యానికి బానిసలై శానిటైజర్​ తాగి చనిపోయారని స్థానికులు తెలిపారు. అయితే వీరితో కలిసి మరో ఇద్దరు వేర్వేరు చోట్ల చనిపోయారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు దానిని ధ్రువీకరించడం లేదు.

By

Published : Aug 8, 2020, 1:03 AM IST

పారిశుద్ధ్య కార్మికుల అనుమానాస్పద మృతి.. శానిటైజర్​ తాగడమే కారణమా..?
పారిశుద్ధ్య కార్మికుల అనుమానాస్పద మృతి.. శానిటైజర్​ తాగడమే కారణమా..?

చిత్తూరు జిల్లా తిరుపతి స్కావెంజర్స్​ కాలనీలో వీరయ్య, కుమారస్వామి అనే ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన వీరు భోజనానంతరం విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వాంతులు రావడంతో.. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. ఫలితాల అనంతరం మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహిస్తారని... అప్పుడే వీరి మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇద్దరా.. నలుగురా..?

స్కావెంజర్స్ కాలనీకి చెందిన వీరిద్దరితో పాటు అదే కాలనీకి చెందిన మరొకరు, చేపల మార్కెట్ సమీపంలో మరొకరు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం ప్రాణాలు కోల్పోయిన నలుగురు ఒక బృందంగా తిరుగుతుంటారని... మద్యానికి బానిసలై... శానిటైజర్‌ తాగడం వల్లే వీరు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఇద్దరి మృతిని ధ్రువీకరిస్తుండగా.. మరో ఇద్దరు చనిపోయిన ఘటన తమ దృష్టికి రాలేదని అన్నారు.

ఇదీ చూడండి..

ప్రాణాలతో చెలగాటం.. మానవ వ్యర్థాలు శుభ్రం చేస్తున్న మనుషులు

ABOUT THE AUTHOR

...view details