హనుమంతుని జన్మస్థానం సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతంగా నిరూపించేందుకు ఈనెల 21న శ్రీరామనవమి పర్వదినాన తితిదే సిద్ధమవుతోంది. ఉగాది రోజున శాస్త్రీయ ఆధారాలతో నిరూపించనున్నట్లు తితిదే ఇటీవల ప్రకటించింది. కానీ ఆంజనేయస్వామి శ్రీరాముడి ప్రియ భక్తుడైనందున శ్రీరామనవమి రోజున ఆయన జన్మ వృత్తాంతాన్ని వెల్లడించాలని తాజాగా నిర్ణయించింది. ఆ రోజున పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో తితిదే నిరూపించనుంది. అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ధ్రువీకరించే సాక్ష్యాల గురించి సమగ్రంగా అధ్యయనం చేయడానికి తితిదే ఈవో జవహర్రెడ్డి గత ఏడాది డిసెంబరులో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
తిరుమలకు ప్లాస్టిక్ సీసాలు తీసుకురావొద్దు