ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 23, 2020, 8:11 AM IST

ETV Bharat / city

కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం

కరోనా వైరస్‌ ప్రభావం బారిన పడకుండా తితిదే ఆస్థాన విద్వాంసురాలు, గాయని శోభారాజు ప్రజలను చైతన్యపరిస్తూ ఓ గీతాన్ని ఆలపించి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రజలు ఇళ్లు వదలి రావొద్దని, ఎవరినీ కలవొద్దంటూ, మన సంస్కృతిలో భాగమైన నమస్కారాన్ని పాటించాలని ఆమె సూచించారు.

కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం
కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం

కరోనా జాగ్రత్తలపై గాయని శోభారాజు చైతన్యగీతం

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరుస్తూ తితిదే ఆస్థాన విద్వాంసురాలు, గాయని శోభారాజు గీతాన్ని ఆలపించి ఆన్​లైన్​లో విడుదల చేశారు. వైరస్ నియంత్రణకు ప్రజలు ఇళ్లువదలి రావొద్దని, ఎవరిని కలవరాదంటూ... చేతులు సబ్బుతో కడుక్కోవాలంటూ పాట పాడారు. ముఖంలోని ఏ భాగాన్ని చేతితో తాకరాదంటూ... ఇతరులతో చేయి చేయి కలపకుండా మన సంస్కృతిలో భాగమైన నమస్కారాన్ని చేయాలని సూచించారు. మంచి భవిష్యత్తు కోసం కరోనా బారిన పడకుండా ఉండడమే నిజమైన ఉపనిషత్తుగా శోభారాజు ఆలపించిన పాట ప్రజలను చైతన్యపరుస్తూ ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి:కరోనాపై 'సిత్తరాల సిరపడు' సూరన్న పాట

ABOUT THE AUTHOR

...view details