అలిపిరి - చెర్లోపల్లి మార్గంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, సైన్స్ సిటీ, ఎస్వీ శిల్ప కళాశాల తదితర ప్రాంతాలను జేఈవో సదాభార్గవి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు. విలువైన ఆస్థులు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తితిదే ఆస్తులుగా గుర్తించడానికి అవసరమైన బోర్డులు, సరిహద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఖాళీ ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు.
తితిదే ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు: జేఈవో - తితిదే ఆస్తులపై జేఈవో సదాభార్గవి న్యూస్
తితిదే ఆస్థులు ఆక్రమణకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జేఈవో సదాభార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న తితిదే ఆస్తులను ఇంజినీరింగ్, విజిలెన్స్, ఎస్టేట్ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.
![తితిదే ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు: జేఈవో తితిదే ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు: జెఈవో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9337595-365-9337595-1603862558281.jpg)
తితిదే ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు: జెఈవో