శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం
TIRUMALA: శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం: ధర్మారెడ్డి - TTD gives other chance for lord balaji darshan over rains
భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారిని(tirumala balaji temple) దర్శించుకోలేని భక్తులకు.. తితిదే దర్శన అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 18 నుంచి 30 వరకు దర్శన టికెట్లు కలిగి.. తిరుమలకు రాలేనివారు.. వచ్చే ఆరు నెలల్లో వీలున్నప్పుడు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటునిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కనుమదారుల్లోనూ భక్తులను అనుమతిస్తున్నామంటున్న తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డితో.. ఈటీవీ భారత్ ముఖాముఖి.

శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం