నగల మాయంపై పూర్తిస్థాయి విచారణ: తితిదే ఈవో - ట్రెజరీలో నగలు మాయం
ట్రెజరీలో నగలు మాయం వ్యవహారంపై తితిదే ఈవో స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఏఈవో శ్రీనివాస్పై రికవరీ పెట్టామని...అప్పటికీ నగల పరిమాణంలో తేడాలు ఉంటే బాధ్యుల నుంచి నగలు రికవరీ చేస్తామని ఈవో వివరణ ఇచ్చారు.
![నగల మాయంపై పూర్తిస్థాయి విచారణ: తితిదే ఈవో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4258553-thumbnail-3x2-ttd.jpg)
ttd-eo-press-meet
నగలు మాయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం: తితిదే ఈవో
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీలో నగలు మాయం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏఈవో శ్రీనివాస్పై రికవరీ పెట్టామని... ఆయన వినతి మేరకు పూర్తిస్థాయిలో తనిఖీలు చేశాక తదుపరి చర్యలు తీసుకుంటామని సింఘాల్ వివరించారు. అప్పటికీ నగల పరిమాణంలో తేడాలు ఉంటే బాధ్యుల నుంచి నగలు రికవరీ చేస్తామని ఈవో తెలిపారు.