ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD CHAIRMAN: మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వైవీ సుబ్బారెడ్డి - ttd latest news

టీటీడీ ఛైర్మన్​గా రెండవసారి పదవీ వరించడంతో శ్రీవారి మెట్టు మార్గం గుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు నడిచి వెళ్లారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలకు నడిచి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమలకు నడిచి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి

By

Published : Aug 10, 2021, 7:16 PM IST



తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్​గా రెండవసారి పదవీ వరించడంతో శ్రీవారి మెట్టు మార్గం గుండా వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు నడిచి వెళ్ళారు. శ్రీవారి మెట్టు వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చైర్మన్​గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో చొరవ చూపుతానని దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కరోనా మహమ్మారి నుంచి రక్షింపబడాలని స్వామివారిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:
Netanna Nestam: వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధులు విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details