ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నకిలీ వెబ్​సైట్​పై చర్యలకు తితిదే ఛైర్మన్ ఆదేశం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ నకిలీ వెబ్​సైట్​పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టాలని సూచించారు.

By

Published : Dec 7, 2020, 10:08 PM IST

ttd chairman yv subba reddy
ttd chairman yv subba reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా అందచేస్తామని ప్రచారం చేసుకుంటున్న www.balajiprasadam.com వెబ్​సైట్​పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్​సైట్ వివరాలు సేకరించి సంబంధిత వ్యక్తులపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఐటీ విభాగం సహాయంతో వెబ్​సైట్​ను బ్లాక్ చేయించాలని సూచించారు. శ్రీవారి ప్రసాదాల పేరుతో భక్తులను మోసం చేస్తున్న విషయం ఛైర్మన్ దృష్టికి రావటంతో స్పందించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details