ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుచానూరు అమ్మవారికి తితిదే ఛైర్మన్ లక్ష్మీకాసుల హారం విరాళం - పద్మావతి అమ్మవారికి బంగారు హారం విరాళమిచ్చిన తితిదే ఛైర్మన్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి.. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు బంగారు హారాన్ని విరాళమిచ్చారు. రూ. 3 లక్షలకుపైగా విలువ చేసే, 55.160 గ్రాముల బరువున్న ఈ ఆభరణాన్ని.. ఈవో జవహర్ రెడ్డికి అందచేశారు. పంచమీ తీర్థం అనంతరం నిర్వహించిన స్నపన తిరుమజనంలో.. హారాన్ని అమ్మవారికి అలంకరింప చేశారు.

donation to tiruchanuru goddess
కాసుల హారంతో తితిదే ఛైర్మన్ దంపతులు

By

Published : Nov 19, 2020, 7:05 PM IST

తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు హారాన్ని విరాళంగా అందచేశారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో చివరి రోజు పంచమీ తీర్థం(చక్రస్నానం) పుర‌స్క‌రించుకుని.. స‌తీమ‌ణి స్వ‌ర్ణ‌ల‌త రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 55.160 గ్రాముల బరువుతో.. రూ. 3 లక్షలకు పైగా విలువైన ఆభరణాన్ని అమ్మ‌వారికి బ‌హూక‌రించారు.

ఛైర్మ‌న్ దంప‌తులు.. తితిదే ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డికి అమ్మ‌వారి ఆల‌యంలో ల‌క్ష్మీ కాసుల హారం అంద‌జేశారు. అర్చ‌కులు ఈ ఆభరణాన్ని అమ్మ‌వారి మూల‌మూర్తి వ‌ద్ద ఉంచి పూజ‌లు చేశారు. ‌అనంత‌రం పంచమీ తీర్థం సంద‌ర్భంగా నిర్వ‌హించిన స్న‌ప‌న తిరుమంజ‌నంలో అమ్మ‌వారికి అలంక‌రించారు.

ఇదీ చదవండి:వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details