తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై.. జీబీపీ రెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ అందక 11 మందే మృతి చెందారని ప్రభుత్వం పేర్కొనడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. మృతుల సంఖ్యను గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. వేసవి సెలవుల అనంతరం ఈ అంశంపై విచారణ జరుపుతామని స్పష్టంచేసింది.
రుయాలో మరణాలపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం - రుయాలో మరణాలు
రుయా ఆస్పత్రి ఘటనలో మృతుల సంఖ్యను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని జీబీపీ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
![రుయాలో మరణాలపై కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం high court orders on ruia incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11816941-973-11816941-1621417601156.jpg)
రుయాలో మరణాలపై హైకోర్టులో విచారణ