ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2021, 6:09 AM IST

ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక: నేడు నామినేషన్ల పరిశీలన

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.

tirupati by poll 2021
తిరుపతి ఉపఎన్నిక 2021

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా, ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 34 మంది నామినేషన్లు వేశారు. వీటిని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు బుధవారం పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 3 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 17న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details