ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 15, 2020, 7:14 PM IST

ETV Bharat / city

ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం... పాస్టర్ అరెస్టు

చిత్తూరు జిల్లాలో ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన పాస్టర్ దేవసహాయాన్ని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పట్టుకున్నారు. గురువారం తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయంలో మీడియా ముందుకు తీసుకువచ్చారు.

pastor raped a young woman
pastor raped a young woman

ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఓ పాస్టర్​ను తిరుపతి అర్బన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

తన కుమార్తెపై చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పరిధిలో పాస్టర్ దేవసహాయం అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి తిరుపతి అర్బన్ పోలీసులకు ఈ నెల 12న స్పందన ద్వారా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... గురువారం మధ్యాహ్నం తిరుపతి బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు.

ఉద్యోగం పేరుతో యువతిపై దేవసహాయం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాస్టర్ దేవసహాయం కారణంగా గతంలో కొంత మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మా దృష్టికి వచ్చింది. దేవసహాయం భార్యనూ విచారిస్తున్నాం. ఉద్యోగం చేసే యువతులు అప్రమత్తంగా ఉండండి. అన్యాయం జరిగిందని ఏ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు స్వీకరిస్తాం. నిందితుడు దేవసహాయాన్ని రిమాండ్​కి తరలిస్తున్నాం - రమేష్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ

ఇదీ చదవండి

తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి యువకుడి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details