ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి ఒంటిగంటన్నర నుంచే ప్రారంభమయ్యాయి. ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ముందుగా తిరుప్పావై పాశురాల ప్రక్రియ నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖుల దర్శనాల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి.

By

Published : Jan 6, 2020, 8:50 AM IST

tirumala-tirupati-devasthanam
tirumala-tirupati-devasthanam

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి ఒంటిగంటన్నర నుంచే ప్రారంభమయ్యాయి.ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ముందుగా తిరుప్పావై పాశురాల ప్రక్రియ నిర్వహించారు.సుమారు2గంటల పాటు రాజకీయ,వివిధ రంగాల ప్రముఖుల దర్శనాల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభమయ్యాయి.తెల్లవారు జామున5గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామని ముందుగా చెప్పినప్పటికీ...గంట ముందుగానే4గంటలకే సామాన్య భక్తులను అనుమతించారు.నిన్న మధ్యాహ్నం నుంచే కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంతో పరవశించారు.

ABOUT THE AUTHOR

...view details