ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం..

By

Published : Oct 16, 2021, 8:52 AM IST

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అత్యంత ఘనంగా సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజావరోహణంతో పూర్తయ్యాయి.

Tirumala Brahmotsavam
Tirumala Brahmotsavam

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా.. తొమ్మిదోరోజు రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. గరుడాళ్వార్‌ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం.

ఈ ఉత్సవంలో భాగంగా.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలురకు వీడ్కోలు చెబుతూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభం మీద నుంచి కిందకు దించారు. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా గరుడాళ్వార్‌ దేవతలను కోరాడు.

ఈ సందర్భంగా.. గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలకగద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు. ఈ ఘట్టంతో.. బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: IRUMALA: అశ్వ వాహనంపై శ్రీవారి దర్శనం... రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ABOUT THE AUTHOR

...view details