ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GOVERNOR TAMILISAI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. వేదాశీర్వచనం అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు.

By

Published : Jan 16, 2022, 9:24 AM IST

Updated : Jan 16, 2022, 10:29 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న గవర్నర్​కు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకుని వైరస్ బారి నుంచి రక్షించుకోవాలని కోరారు.

తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి - తమిళి సై, తెలంగాణ రాష్ట్ర గవర్నర్

Last Updated : Jan 16, 2022, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details