ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2021, 6:27 PM IST

ETV Bharat / city

వివాహిత అనుమానాస్పద మృతి... ఆమె భర్త ఎక్కడ..?

చిత్తూరు జిల్లా నీరుగట్టువారిపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

Suspicious death of a married woman at Neerugattuvaripalli in Chittoor district
వివాహిత అనుమానాస్పద మృతి... దారితీస్తున్న పలు అనుమానాలు...

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తిరుపతి సమీపంలోని మంగళంకు చెందిన 18 ఏళ్ల ఉమా.. చిత్తూరుకు చెందిన రామాంజులు ఆర్నెళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్థానికంగా చేనేత మగ్గం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఉమా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే సమయంలో భర్త రామాంజులు కనిపించకపోవడంతో.. పలు అనుమానాలకు దారి తీస్తుంది. అంతకుముందే మృతురాలి తండ్రి చనిపోగా.. ఆమె తల్లి కువైట్​లో ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఉమా తన ఇంట్లో ఉరి వేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'చంద్రబాబుకు ఎస్​ఈసీ బంట్రోతులా పనిచేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details