ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2021, 8:29 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు చర్యలు: అనిల్ సింఘాల్‌

రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరం పెరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌ తెలిపారు. ఈ మేరకు ప్రధానికి సీఎం లేఖ రాశారని వెల్లడించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్‌

రాష్ట్రంలో పెరుగుతున్న ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా... 25 క్రయోజనిక్ ట్యాంకర్లు, 10 వేల ఆక్సిజన్ కాన్​సన్​ట్రేటర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారని సింఘాల్ తెలిపారు. కొత్తగా 6 ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి ద్వారా 25 టన్నుల సామర్థ్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details