ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2020, 2:10 PM IST

ETV Bharat / city

'భవిష్యత్తులో కూడా జగన్​ సీఎంగా కొనసాగాలి'

పేదల అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడుతున్న సీఎం జగన్​ భవిష్యత్​లో కూడా సీఎంగా కొనసాగాలని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్​రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా కడప, చిత్తూరు జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు విశేష స్పందన లభించింది.

Special response to the blood donation camps organized on the occasion of CM Jagan's birthday
భవిష్యత్తులో కూడా జగన్​ సీఎంగా కొనసాగాలి: ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. కడప జిల్లా, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సచివాలయం సిబ్బంది, వార్డు వాలెంటర్లు రక్తదానం చేయడంతో విశేష స్పందన లభించింది.

తిరుపతిలో...

తిరుపతి ఎంపీడీవో కార్యాలయంలో వైకాపా నాయకులు ఏర్పాటు రక్తదాన శిబిరాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కుమారుడు అచ్యుత్ రెడ్డి రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details