పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి .. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాతో కలిసి తిరుపతిలో పర్యటించారు. తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న ప్రకాశం మున్సిపల్ పార్కు, తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు.
ఉద్యానవనంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీలక్ష్మీకి వివరించారు. చిన్నారులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాలను, పార్క్లో ఏర్పాటు చేస్తున్న పచ్చిక బయళ్లను పరిశీలించారు. ఉద్యానవనాలు నగరవాసులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం రేణిగుంట రోడ్డు వద్ద నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ, సౌర విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు.