TTD SARVADARSHNAM: తిరుమల శ్రీవారి సర్వదర్శన భక్తులకు.. అదనంగా 2 గంటలు దర్శనం కల్పిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాల రద్దుతో.. భక్తులకు అదనంగా 3 గంటలు దర్శన భాగ్యం లభిస్తుంది.
సర్వదర్శనం టోకెన్లు సంఖ్య పెంపు..
శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతున్నట్లు తితిదే స్పష్టం చేసింది. ఈ మూడ్రోజుల్లో.. రోజుకు 30 వేల టోకెన్ల చొప్పున జారీ చేయనున్నట్లు తెలిపింది.