తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్ డిపోలో ఆర్టీసీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పుణ్య క్షేత్ర పవిత్రతను దెబ్బతీసేలా, భక్తులకు అసౌకర్యం కలిగేలా ర్యాలీలు, నిరసనలు చేపట్టకుండా తిరుమలలో నిబంధనలు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా... ఈ ఉద్యోగ సంఘం వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది.
ఒక్క లీటర్ డీజిల్కు నిర్ణీత కిలోమీటర్లు (కె.ఎమ్.పి.ఎల్) బస్సు నడవాలన్న నిబంధన పేరుతో వేధించవద్దని, చలి తట్టుకునేందుకు స్వెట్టర్లు అందజేయడం వంటి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ప్రదర్శిస్తూ ఉద్యోగులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.