ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల చేరుకున్న రాష్ట్రపతి కోవింద్

రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల చేరుకున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు.

By

Published : Jul 13, 2019, 6:15 PM IST

Updated : Jul 13, 2019, 9:00 PM IST

president_ramnathkovind_reached_to_tirupathi

తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి జగన్​ ఘనస్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి రాష్ట్రపతి దర్శించుకున్నారు. కుంకుమ అర్చనలో కోవింద్ దంపతులు పాల్గొన్నారు. వారికిఅమ్మవారి తీర్థప్రసాదాలను తితిదే ఈవో,ఛైర్మన్‌ అందజేశారు.అంతకుముందు ఆయనకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతిశ్రీ కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కపిలేశ్వర ఆలయంలో నవగ్రహ పూజ చేశారు. అనంతరం తిరుమలలోనిపద్మావతి అతిథిగృహానిరకి రాత్రి బస నిమిత్తం చేరుకున్నారు. సోమవారం ఉదయం 5.40 గం.కు వరాహస్వామిని... 6 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీహరికోటకు వెళ్లనున్నారు.

తిరుపతి పర్యటనలో రాష్ట్రపతి
Last Updated : Jul 13, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details