ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుపతి ఉపఎన్నిక: ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం

By

Published : Apr 1, 2021, 4:26 AM IST

తిరుపతి ఉప ఎన్నిక కోసం.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా..వైకాపా, తెదేపా, భాజపా ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడి పెంచుతున్నాయి. ప్రశ్నించే గొంతుకను ఎన్నుకొని.. పార్లమెంట్‌కు పంపాలని తెదేపా నేతలు కోరుతుంటే, వైకాపా అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రికి కానుగా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. మరోవైపు, వైకాపా అభ్యర్థిని గెలిపిస్తే జగన్‌ సేవ తప్ప, జనం సేవ ఉండదని భాజపా నాయకులు విరుచుకుపడుతున్నారు.

tirupati by election 2021
తిరుపతి బై పోల్ 2021

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో..వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఓటర్లను కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం పరిధిలోని..గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి కన్నబాబు తొండమనాడులో ఎడ్లబండిపై ఎక్కి..ప్రచారం చేశారు. వైకాపా ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని..అభ్యర్థించారు. వైకాపాతోనే రైతు అభివృద్ధి జరుగుతుందని కన్నబాబు ప్రజలకు వివరించారు.

తెదేపా నాయకులు..విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా..పలువురు ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో..పార్టీ నాయకులతో సమావేశమైన అచ్చెన్నాయుడు..అనుభవమున్న పనబాక లక్ష్మీని గెలిపించాలని కోరారు. పుర ఫలితాల్లో.. వైకాపా ఎన్నో అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. భాజపాలో జగన్ కోవర్టులు ఉన్నారని..వారంతా నోరు తెరిస్తే చంద్రబాబును విమర్శించడం తప్ప.. జగన్ జోలికి వెళ్లరని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేసిన..ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి.. స్థానిక సమస్యలు, వైకాపా పాలనలో పెరిగిన ధరలపై ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తేదేపా అభ్యర్థిని గెలిపించాలని.. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఓటర్లను కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లెలో పర్యటించిన ఆయన..స్థానిక తేదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వైకాపా రెండేళ్ళ కాలంలో అవినీతి అక్రమాలను బూత్ స్థాయి నుంచి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

తిరుపతి ఉపఎన్నికల్లో జగన్ సేవకులు కాకుండా..జన సేవకులకు ఓటేయాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. శ్రీకాళహస్తిలో భాజపా, జనసేన కార్యకర్తలతో..సమావేశం నిర్వహించిన ఆయన..రత్నప్రభ విజయానికి.. శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి..జగన్‌కు కానుకగా పంపాలన్న వైకాపా నేతల వ్యాఖ్యలు.. హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి
ప్రియుడితో కలిసి.. భర్త, మామపై హత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details